Warning for chicken eaters(AP news today telugu): రెండేళ్ల క్రితం చైనా నుంచి వచ్చి ప్రపంచ దేశాలను వణికించింది కరోనా.ఆ మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే అందరూ కోలుకుంటున్నారు. అంతలోనే మరో వ్యాధి కలకలం రేపుతోంది. అది కూడా తెలుగు రాష్ట్రాల్లో వ్యాపించడం ఆందోళన కలిగిస్తోంది. నెల్లూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ వ్యాధి ఇప్పుడు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది.
Read More: జగన్ క్రూరత్వానికి అద్దం పట్టిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’.. కాస్కో అంటున్న చంద్రబాబు
నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో వేల సంఖ్యలో కోళ్లు మృత్యువాతపడ్డాయి. దీంతో పశుసంవర్ధక శాఖ అధికారులు వాటి శాంపిల్స్ను భోపాల్లోని టెస్టింగ్ కేంద్రానికి పంపించారు. వాటిని పరీక్షించిన నిపుణులు బర్డ్ ఫ్లూగా నిర్ధారిచారు. దీంతో గ్రామస్థులు బర్డ ఫ్లూతో బాధ పడుతున్నారు. బర్డ్ ఫ్లూ సోకిన బాయిలర్, లేయర్, నాటుకోళ్లు వేల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయి.
అయితే ఈ వ్యధి ప్రజలకు వ్యాపించకుండా అధికారులు చర్యలు చేపట్టారు. పొదలకూరు, కోవూరు ప్రాంతాల్లోని పలు గ్రామాల్లో శానిటైజేషన్ పనులు చేపట్టి.. బయట వ్యక్తులు రావొద్దని హెచ్చరికలు జారీ చేసి.. పలు జాగ్రత్తులు చేపట్టారు. ముఖ్యంగా చికెన్ దుకాణాలను అధికారులు మూసివేశారు.