New Vote Registration: ఇప్పటికే ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. అదే సమయంలో దేశంలో ఓటర్ల సంఖ్యను సీఈసీ ప్రకటించారు. భారత్ లో 97 కోట్ల మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఇప్పటికీ అర్హత ఉన్నా ఓటు హక్కులేని వారికి మరో అవకాశాన్ని కేంద్ర ఎన్నికల సంఘం కల్పించింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఎన్నికల సంఘం ఓటర్ల జాబితాను ప్రకటించింది.
తొలుత ఓటర్ల జాబితాలో ఓటు ఉందో ? లేదో చూసుకోవాలి. ఓటు లేకపోతే దరఖాస్తు చేసుకోవాలి. ఓటు మిస్సైన వారు, ఇప్పటి అర్హత ఉన్నా ఓటు రాని వారు ఓటు కోసం నమోదు చేసుకోవచ్చు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సీఈసీ సూచించింది.
ఓటు నమోదు కార్యక్రమాన్ని నిరంతర ప్రక్రియగా చేపడుతున్నారు. ఏటా జనవరి, ఏప్రిల్, జూలై, అక్టోబర్ నెలల్లో ఒకటో తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు కల్పిస్తున్నారు. వారు ముందుగా ఓటు కోసం దరఖాస్తు చేసుకోవాలి. తెలుగు రాష్ట్రాల్లో మే 13న పోలింగ్ జరగనుంది. నెలరోజుల ముందు వరకు కొత్తగా ఓటు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉంది.
Also Read : ఎలక్షన్ కోడ్ ఎఫెక్ట్.. రూ.50 వేల కంటే ఎక్కువ ఉంటే ఇక అంతే?
తెలుగు రాష్ట్రాల్లో ఏప్రిల్ 15 లోపు వరకు దరఖాస్తు చేసుకున్న వారికి ఓటు హక్కు కల్పిస్తారు. వారికి ఈ ఎన్నికల్లోనే ఓటు వేసే అవకాశం దక్కుతుంది. కొత్తగా ఓటు నమోదు చేసుకోవాలనుకునేవారు ఫారం-8 దరఖాస్తు చేసుకోవాలి. ఆన్ లైన్ ఈ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు.
ఆఫ్ లైన్ లో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. నియోజకవర్గ ఎలక్షన్ ఆఫీసర్ , సహాయ ఎన్నికల అధికారి, పోలింగ్ కేంద్ర అధికారికి నేరుగా కూడా దరఖాస్తులు సమర్పించవచ్చు. ఓటులో మార్పులు చేర్పులకు కూడా సీఈసీ అవకాశం కల్పించింది.