Vishakapatnam : విశాఖ జిల్లాలో భారీగా పట్టుబడిన గంజాయిని పోలీసులు ధ్వంసం చేశారు. 14 గుట్టలుగా పోసి గంజాయిని కాల్చేశారు. కొన్నాళ్లుగా ఆంధ్రా ఒడిశా బోర్డర్ నుంచి గంజాయి అక్రమ రవాణా అవుతోంది. దీనిపై దృష్టి పెట్టిన పోలీసులు….గంజాయికి రవాణాకు చెక్ పెట్టారు.
ఇప్పటివరకు దాదాపు 925 కేసులు నమోదు చేశారు. దాదాపు రెండు లక్షల కేజీల గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయి విలువ 250 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ నేతృత్వంలో గంజాయిని దహనం చేశారు.