Visakhapatnam : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వలసలు ఊపందుకుంటున్నాయి. తమ పార్టీలో టిక్కెట్ రాదంటే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది.
Visakhapatnam : ఏపీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. వలసలు ఊపందుకుంటున్నాయి. తమ పార్టీలో టిక్కెట్ రాదంటే గోడ దూకేందుకు సిద్ధమవుతున్నారు. ఏపీలో అధికార పార్టీకి వరుసగా షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే కొందరు కీలక నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఇప్పుడు మరికొందరు నేతలు అదే బాటలో ఉన్నారని తెలుస్తోంది.
విశాఖలో వైసీపీకి షాక్ తగలనున్నట్లు తెలుస్తోంది. వైసీపీని వీడే ఆలోచనలో MLC వంశీకృష్ణ శ్రీనివాస్ ఉన్నట్లు సమాచారం. బుధవారం జనసేన అధినేత పవన్ కల్యాణ్ ను ఆయన కలుస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో తన వర్గం కార్పొరేటర్లతో వంశీకృష్ణ మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
గతంలో విశాఖ మేయర్ పదవికి ప్రయత్నించి భంగపడ్డారు వంశీకృష్ణ శ్రీనివాస్. దీంతో ఆయనకు స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ ఇచ్చింది వైసీపీ. కానీ ఇప్పుడు ఆయన పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆయనకు పార్టీ చాలా అవకాశాలు ఇచ్చిందని మంత్రి అమర్నాథ్ అన్నారు. ఒకవేళ ఆయన పార్టీ మారితే రాజకీయ ఆత్మహత్యే అవుతందని అభిప్రాయపడ్డారు.