Visakhapatnam : విశాఖలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ తీరుపై కొంత కాలం నుంచి అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ వంశీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘకాలం సేవలు అందించినా అవమానాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి జన సేన అభ్యర్ధిగా హామీ లభించినట్లు సమాచారం.
Visakhapatnam : విశాఖలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. పార్టీ తీరుపై కొంత కాలం నుంచి అసంతృప్తిగా ఉన్న ఎమ్మెల్సీ వంశీ రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. సుదీర్ఘకాలం సేవలు అందించినా అవమానాలే మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికే ఆయన జనసేనలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. భీమిలి లేదా విశాఖ సౌత్ నుంచి జన సేన అభ్యర్ధిగా హామీ లభించినట్లు సమాచారం.
ఉత్తరాంధ్ర వైసీపీలో ప్రకంపనలు మొదలయ్యాయి. పార్టీకి త్వరలో రాజీనామా చేస్తానంటున్న వైసీపీ ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ ఆడియో వైరల్గా మారింది. వార్డు స్థాయి నాయకుడితో పార్టీకి రాజీనామా చేయమంటూ వంశీ కృష్ణ వ్యాఖ్యలు చేశారు. నీ తర్వాత నేను కూడా రాజీనామా చేస్తానని వంశీ తెలిపారు.
గాజువాక ఇంచార్జిగా ఊరకూటి రామచంద్ర యాదవ్ నియామకంపై అసంతృప్తితో ఎమ్మెల్సీ వంశీకృష్ణ ఉన్నారు. తనతో సంప్రదించకుండా గాజువాకలో యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ని నియమించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.