Visakhapatnam : విశాఖపట్నంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ నేత, మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పార్టీకి రాజీనామా చేశారు. ఆయన జనసేన, టీడీపీ వైపు చూస్తున్నట్లు సమాచారం. మంత్రి గుడివాడ అమర్నాథ్తో ఉన్న వైరుధ్యాలు, వైసీపీ అధిష్టానం పట్టించుకోకపోవడం లాంటి కారణాలతో దాడి వీరభద్రరావు వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలుస్తోంది.
గతంలో దాడి వీరభద్రరావును జనసేనలోకి పవన్ కల్యాణ్ ఆహ్వానించారు. దీంతో ఆయన, ఆయన కుమారుడు దాడి రత్నాకర్ జనసేనలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో తెలుగుదేశంలో ఉన్న దాడి వీరభద్రరావు 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ ఆయనకు పెద్దగా గౌరవం దక్కలేదన్న టాక్ ఉంది. అనకాపల్లి ఎమ్మెల్యే సీటును గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ కు కేటాయించారు జగన్. విశాఖ పశ్చిమ నియోజకవర్గాన్ని దాడి తనయుడు దాడి రత్నాకర్ కు కేటాయించారు. అయితే అక్కడ పోటీ చేసిన రత్నాకర్ ఓడిపోయారు.
గతంలో కూడా ఓ సారి పవన్ కల్యాణ్.. దాడి వీరభద్రరావును నేరుగా కలిశారు. మర్యాదపూర్వకంగా భేటి అయ్యి, సూచనలు,సలహాలు తీసుకున్నారు. అప్పటినుంచే ఆయన జనసేనలో చేరతారని ప్రచారం సాగుతోంది. ఇప్పడు దీనిపై ఓ క్లారిటీ రానుంది.