Vijayasai Reddy Daughter: ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జాకు గురైనట్టే. నదులు చుట్టూ మాత్రమే కాదు చివరకు సముద్రం చుట్టూ భూములను వదల్లేదు. తాజాగా విశాఖలోని భీమిలి బీచ్కు కూతవేటు దూరంలో వైపీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూతురు నేహారెడ్డి నిబంధనలను ఉల్లంఘిస్తూ ప్రహారీ నిర్మాణం చేపట్టారు. ఈ వ్యవహారం న్యాయస్థానం వరకు వెళ్లింది. చివరకు బుధవారం ఉదయం జీవీఎంసీ అధికారులు గోడను కూల్చివేశారు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత భీమిలి బీచ్పై కన్నేశారు ఆనాటి పాలకుల్లో కొంతమంది. అధికారం తమ చేతుల్లో ఉందని, తమను ఎవరు అడుగుతారనే ధీమాతో తీరానికి సమీపంలో గోడను కట్టేశారు వైపీపీ ఎంపీ విజయ సాయిరెడ్డి కూతురు నేహారెడ్డి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి మరీ కాంక్రీట్ గోడను నిర్మాణం చేశారు.
ALSO READ: బెజవాడ వరద.. బాధితుల ఆగ్రహం.. కొందరికే సాయం.. అడ్మినిస్ట్రేషన్ ఫెయిలైందన్న సీఎం చంద్రబాబు
ఈ వ్యవహారంపై జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. బీచ్ సమీపంలో కాంక్రీటు నిర్మాణాలకు అనుమతించవద్దని అధికారులను న్యాయస్థానం ఆదేశించింది. ఈ క్రమం లో ఎంపీ కూతురికి ఈనెల రెండున జీవీఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. 24 గంటల్లో ఆక్రమణలు తొలగించాలని లేకుంటే తామే కూల్చివేస్తామని హెచ్చరించింది. అయినా పట్టించుకోలేదు. దీంతో బుధవారం ఉదయం జీవీఎంసీ అధికారులు కట్టిన గోడను కూల్చివేశారు.
విశాఖ: భీమిలి బీచ్ వద్ద వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి చెందిన అక్రమ కట్టడాలను తొలగిస్తున్న జీవీఎంసీ అధికారులు.#Ysrcp #VijaysaiReddy #Visakhapatnam #BheemiliBeach #AndhraPradesh #NewsUpdates #Bigtv @YSRCParty @ysjagan @VSReddy_MP pic.twitter.com/TqzlQxofhF
— BIG TV Breaking News (@bigtvtelugu) September 4, 2024