Vangaveeti Radha: టీడీపీ నేత వంగవీటి రాధా గుండె పోటు వచ్చింది. తెల్లవారుజామున ఛాతీలో నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు విజయవాడలోని ఓ ప్రముఖ ఆసుపత్రికి తరలించారు.
ప్రస్తుతం డాక్టర్లు అబ్జర్వేషన్లో వంగవీటి రాధా ఉన్నారు. స్వల్పంగా గుండెపోటు వచ్చిందని, ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నది డాక్టర్ల మాట. యాంజియోగ్రామ్ చేసి స్టెంట్ వేసినట్టు తెలుస్తోంది. మరో 48 గంటల పర్యవేక్షణలో ఉండాలని రాధా కుటుంబ సభ్యులకు వైద్యులు సూచన చేశారు.
ప్రస్తుతం రాధా ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకోవడానికి కాస్త సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. వంగవీటి రాధా అనారోగ్యం విషయం తెలియగానే ఆయన అభిమానులు ఇంటికి చేరుకున్నారు. రాధాకు ఏమైందంటూ తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ప్రస్తుతం ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారని చెప్పడంతో అక్కడి ఆసుపత్రికి వెళ్లారు. కొద్దిరోజులు వంగవీటి రాధా యాక్టివ్గా లేరని ఇరుగుపొరుగు వారు చెబుతున్నారు. కారణాలు ఏంటనేది తెలీదని అంటున్నారు.