vamshi krishna yadav : జగన్ నాకు ఇచ్చిన దానికి మూడు రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విశాఖలో ఎవ్వరూ లేని సమయంలో నేను వైసీపీలో నిలిచానన్నారు. పార్టీ నుండి ఒక్క రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా పని చేశానన్నారు. పార్టీ కోసం తాను 60 ఎకరాల భూమిన అమ్ముకొన సేవ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
vamshi krishna yadav : జగన్ నాకు ఇచ్చిన దానికి మూడు రెట్లు రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో ఆయన విలేకర్లతో మాట్లాడుతూ విశాఖలో ఎవ్వరూ లేని సమయంలో నేను వైసీపీలో నిలిచానన్నారు. పార్టీ నుంచి ఒక్క రూపాయి తీసుకోకుండా నిస్వార్థంగా పని చేశానన్నారు. పార్టీ కోసం తాను 60 ఎకరాల భూమిని అమ్ముకొని సేవ చేశానని ఆవేదన వ్యక్తం చేశారు.
తాను పార్టీ మారడానికి బలమైన కారణమే ఉందన్నారు వంశీకృష్ణ. వివరాలు మొత్తం సీఎం జగన్ కు పంపానని తెలిపారు. వైసీపీలో తాను ఎవ్వరి నుంచి ఏమైనా పొందానని నిరూపించగలరా ? అని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. వైసీపీలో బీసీ వర్గానికి చెందిన నేతలంతా గుర్రుగా ఉన్నారన్నారు.
విశాఖలో ఒకరు కక్ష కట్టి మేయర్ కాకుండా తనను అడ్డుకున్నారని ఆయన వాపోయారు. మంత్రి అమర్నాథ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలపాలని వంశీ కృష్ణ కోరారు. జగన్ ఇంకా మూడు టర్మ్ లు సీఎంగా అధికారంలో ఉంటారని అనుకున్నాను కానీ.. ఆయన పరిస్థతి ఇంత అధ్వానంగా ఉంటుందని అనుకోలేదని వంశీకృష్ణ విమర్శలు చేశారు.