Vallabbhaneni Balashowry : ఏపీ రాజకీయాల్లో ట్విస్టుల మీద ట్విస్టులు చోటుచేసుకుంటున్నాయి. టిక్కెట్ దక్కదంటే పార్టీ మారిపోతున్నారు. ఈ పరిస్థితి వైసీపీలోనే ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పటికే చాలామంది నేతలు వైసీపీకి గుడ్ బై చెప్పారు. తాజాగా మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి(Vallabbhaneni Balashowry) వైసీపీకి షాక్ ఇస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీడీపీ-జనసేన కూటమిలో ఆయన చేరిక ఖాయమని తెలుస్తోంది.
మొన్న వైసీపీ నుంచి బయటకెళ్లిపోయిన క్రికెటర్ అంబటి రాయుడు కూడా జనసేనలో చేరుతున్నారు. పవన్తో భేటీ అయ్యారాయన. అయితే.. కృష్ణా జిల్లాలోని అవనిగడ్డ, గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియజకవర్గాలు అడుగుతున్నట్టు తెలుస్తోంది. అంబటి రాయుడే కాదు.. బాలశౌరి కూడా ఆ రెండు సెగ్మెంట్లు కోరుతున్నట్టు సమాచారం.
అటు వైసీపీలో కేశినేని నాని చేరిక దాదాపు ఖరారు అయ్యింది. ఆయన విజయసాయిరెడ్డితో కలసి ఉన్న ఫోటో..నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటోలను టీడీపీ శ్రేణులు.. సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్నారు. ఎనికేపాడులోని కేశినేని ఇంటి వద్ద ఇద్దరు నాయకుల ఫోటోల కనిపించటం.. ఈ వార్తలకు నిజం చేకూరుస్తోంది. అయితే.. ఇవి 2017లో.. కలసిన ఫోటోలని కేశినేని నాని అనుచరులు చెబుతున్నారు.