EPAPER
Kirrak Couples Episode 1

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..

TDP: చంద్రబాబు సభలో విషాదం.. 8 మంది మృతి.. పలువురికి గాయాలు..

TDP: బ్రేకింగ్ న్యూస్. చంద్రబాబు కందుకూరు సభలో విషాదం చోటు చేసుకుంది. చంద్రబాబు ర్యాలీకి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ర్యాలీలో చంద్రబాబు ప్రసంగిస్తుండగా.. ఒక్కసారిగా తోపులాట జరిగింది.


వేదికకు సమీపంలోనే కాలువ ఉండటంతో.. తోపులాటలో పలువురు కార్యకర్తలు కాలువలో పడిపోయారు. వారిని వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఎనిమిది మంది మృతి చెందారు. మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

విషయం తెలిసి చంద్రబాబు తన ప్రసంగాన్ని మధ్యలోనే ఆపేశారు. హుటాహుటిన ఆసుపత్రికి వెళ్లారు. క్షతగాత్రులను పరామర్శించారు. మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు.


మృతుల్లో ఇద్దరు మహిళలు ఉన్నారు. చనిపోయిన వారు.. రవీంద్ర, యానాది, పురుషోత్తం, యటగిరి విజయ, కకుమాను రాజా, చిన కొండయ్యగా తెలుస్తోంది.

మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపి.. 10 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు చంద్రబాబు. ప్రమాదంపై నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుందంటూ ట్వీట్ చేశారు లోకేశ్.

Related News

Ongole: ఒంగోలులో ఉద్రిక్తత.. జనసేన ఫ్లెక్సీని తొలగించిన టీడీపీ శ్రేణులు

Pawan Kalyan: ఏడుకొండలవాడా, క్షమించు.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం, ఇక 11 రోజులపాటూ..

Nandamuri Mohan Roopa: వరదల బాధితుల కోసం నందమూరి మోహన్ రూప భారీ విరాళం

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Big Stories

×