EPAPER
Kirrak Couples Episode 1

Tirumala: భక్తులకు అలర్ట్.. రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టిటిడి

Tirumala: భక్తులకు అలర్ట్.. రేపట్నుంచి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనున్న టిటిడి

Tirumala: తిరుమలలో నేటితో వైకుంఠద్వార దర్శనం ముగియనుంది. ఇవాళ రాత్రి ఏకాంతసేవతో శాస్త్రోక్తంగా ముగించనున్నారు. తిరుమలలో 10 రోజుల పాటు వైకుంఠద్వార దర్శనం కల్పించారు టీటీడీ అధికారులు. దీంతో స్వామి వారిని పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకున్నారు. డిసెంబర్‌ 23 నుంచి 10 రోజులపాటు ప్రారంభంకాగా నిత్యం 60 వేల నుంచి 80 వేల మంది భక్తుల దర్శనానికి అనుమతించారు. ఈ సందర్భంగా టీటీడీ అధికారులు సర్వదర్శనాన్ని రద్దు చేసి, దాదాపు 8 లక్షల మందికి పైగా ప్రత్యేక ఉచిత టోకెన్లు పంపిణీ చేసి ఉత్తర ద్వారదర్శనానికి ఏర్పాట్లు చేశారు.


ఇవాళ న్యూ ఇయర్‌ కావడంతో భక్తుల రద్దీ మరింత పెరిగింది. రాత్రి నుంచే కంపార్ట్‌మెంట్లలో వేచి ఉన్నారు. శారదాపీఠం ఉత్తరాధికారి సాత్మానంద సరస్వతి, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, జమ్మూ కశ్మీర్ గవర్నర్ మనోజ్ సిన్హా, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఏపీ మంత్రి గుమ్మనూరు జయరాం, ఏపీ లోకాయుక్త జడ్జి లక్ష్మణ్ రెడ్డి, మినిస్టర్ మేరుగు నాగార్జున, తమిళనాడు మంత్రి గాంధీ, హీరో సుమన్‌తో సహా పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. మరోవైపు రేపటి నుంచి శ్రీవారి సర్వదర్శనం టోకెన్లు జారీ చేయనుంది టీటీడీ. రేపు ఉదయం 4గంటల నుంచి టోకెన్లు మంజూరు చేయనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి దర్శన స్లాట్లు ప్రారంభమవుతాయి.


Related News

Tirupati Ladddu Row: లడ్డూ కల్తీపై జగన్ ఎంక్వైరీ కోరడమేంటి? అప్పుడు అధికారంలో ఉన్నది ఆయనే కదా? : షర్మిల

Janasena Joinings: ఇట్స్ అఫీషియల్.. ఆ ఇద్దరి చేరికను కన్ఫర్మ్ చేసిన జనసేన

MP Vijayasai Reddy: విజయ సాయిరెడ్డి అక్రమ నిర్మాణాల కూల్చివేత.. చంద్రబాబుపై మండిపాటు

Tirumala Laddu Row: తిరుమల లడ్డూ వివాదం, విచారణ ఆపాలంటూ సుబ్బారెడ్డి పిటిషన్, సాయంత్రానికి రిపోర్ట్

Tirupati laddu: తిరుపతి లడ్డూ వివాదం.. అముల్ కంపెనీ ఏం చెప్పిందంటే..

MLC Botsa Comments: తిరుమల లడ్డూ కల్తీ వివాదం.. దేవుడితో రాజకీయాలొద్దన్న వైసీపీ ఎమ్మెల్సీ బొత్స

Jagan clarification: ఒప్పేసుకున్న జగన్.. మళ్లీ బెంగుళూరుకి, పోతే పోనీ అంటూ

Big Stories

×