TTD Complaint to Police: తిరుమల తిరుపతి లడ్డూ ఘటనపై ఏపీలో పెద్ద దుమారమే రేగుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలు ఒకరిపై ఒకరు రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. ఇతర పార్టీల నేతలు కూడా స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవలే ఇందుకు సంబంధించి రాష్ట్ర సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ విచారణ చేయనున్నది.
Also Read: దుర్గగుడిలో అదే పరిస్థితి.. ప్రభుత్వం సీరియస్..
అయితే, తాజాగా టీటీడీ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఏఆర్ డెయిరీ సంస్థపై చర్యలు తీసుకోవాలంటూ తిరుపతి తూర్పు పీఎస్ లో టీటీడీ అధికారులు చేశారు. నిబంధనలు అతిక్రమించి కల్తీ నెయ్యి సరఫరా చేశారంటూ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలంటూ అందులో టీటీడీ కోరింది.
Also Read: సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.400 కోట్లు విరాళం ఓ చరిత్ర.. చంద్రబాబు వెల్లడి