EPAPER

TTD Employees: టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు.. జీతాలు పెంపు..

ttd chairman bhumana karunakar reddy

TTD Employees: టీటీడీ ఉద్యోగులపై వరాల జల్లు.. జీతాలు పెంపు..

TTD Employees: తిరుమల తిరుపతి దేవస్థానాల ఉద్యోగులపై టీటీడీ చైర్మన్, స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి వరాల జల్లు కురిపించారు. తిరుమల కల్యాణ కట్టలో కొన్ని సంవత్సరాలుగా పీస్ రేట్ పని చేస్తున్న క్షురకులకు ఊహించని విధంగా జీతం నిర్ణయించారు. నెలకు 20 వేల రూపాయల కనీస వేతనం అందించాలని నిర్ణయం తీసుకున్నారు.


టీటీడీలో పోటు కార్మికులకు 10 వేలు జీతం పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. వాహన బేరర్లు, ఉగ్రాణం కార్మికులను స్కిల్డ్ లేబర్ గా గుర్తించి జీతాలు పెంచేలా నిర్ణయం తీసుకున్నారు. పెద్ద జీయర్, చిన్న జీయర్ మఠాల నిర్వహణ, అక్కడి ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించడానికి అదనంగా నిధులు కేటాయించారు.

టీటీడీలో వివిధ విభాగాల్లో కాంట్రాక్టు కార్మికుల జీతాలు కనీసం 3 వేలు పెంచేలా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. టీటీడీలోని ప్రతి ఉద్యోగికి, రిటైర్డ్ ఉద్యోగికి ఈనెల 28న ఇంటి స్థలాలు అందజేయనున్నారు.


Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×