AP Incident : వేరుశెనగ విత్తనం ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది. ఆడుకుంటున్న చిన్నారి.. కిందపడిన వేరుశెనగ విత్తన్నాని నోట్లో పెట్టుకుంది. అదికాస్త గొంతులో ఇరక్కుపోవడంతో.. ఊపిరాడక విలవిలలాడిపోయింది.
చిన్నారి అవస్థను గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన కదిరి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అప్పటికే పాప మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు.
చిన్నారి మృతితో తల్లిదండ్రుల రోధనలు మిన్నంటాయి. శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలో ఈ ఘటన జరిగింది.