EPAPER

Tirumala : బ్రహ్మోత్సవాల వేళ.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Tirumala : బ్రహ్మోత్సవాల వేళ.. శ్రీవారి హుండీ ఆదాయం ఎంతో తెలుసా?

Tirumala : తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో భక్తులు శ్రీవారికి భారీగా కానుకలు సమర్పించారు. ఈ ఏడాది నిర్వహించిన రెండు బ్రహ్మోత్సవాల సమయంలో వేంకటేశ్వర స్వామివారికి హుండీ ద్వారా రూ.47.56 కోట్ల ఆదాయం సమకూరింది.


అధిక మాసం వచ్చిన ఏడాది తిరుమలలో రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ప్రతి మూడేళ్లకు ఒకసారి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ఈ ఏడాది శ్రావణమాసం అధికమాసం రావడంతో.. శ్రీవారికి రెండుసార్లు బ్రహ్మోత్సవాలు నిర్వహించారు. తిరుమలలో మొదటి బ్రహ్మోత్సవాలు(సాలకట్ల బ్రహ్మోత్సవాలు) సెప్టెంబర్ 18వ తేదీ నుంచి 26 వరకు జరిగాయి. రెండో బ్రహ్మోత్సవాలు అక్టోబర్ 15వ తేదీ నుంచి 23 వరకు నిర్వహించారు.

బ్రహ్మోత్సవాల సమయంలో 11 లక్షల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. 33.78 లక్షల మంది భక్తులకు ఉచితంగా భోజనం అందించామని పేర్కొన్నారు. ఈ సమయంలో 57.64 లక్షలకుపైగా లడ్డూలు అమ్ముడయ్యాయని వివరించారు. 4.29 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించారని వెల్లడించారు.


బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి అన్ని శాఖలు సమన్వయంతో పనిచేశాయన్నారు. టీటీడీ అధికారులు, 23 వేల మందికిపైగా సిబ్బంది, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఏపీఎస్ఆర్టీసీ అధికారులు కృషి చేశారని కరుణాకర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. భక్తుల నుంచి ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని స్పష్టం చేశారు.

Tags

Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×