Tiruchanuru Padmavathi Temple : తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో వైభవంగా సాగుతున్నాయి. వేడుకల్లో భాగంగా ఐదో రోజు అమ్మవారిని స్వర్ణగజవాహనంపై ఊరేగించారు. అశ్వాలు, వృషభాలు, గజాలు ముందు కదులుతుండగా… మంగళవాయిద్యాలు, భక్తుల కోలాటాల నడుమ అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారి దేదిప్యమాన రూపాన్ని చూసేందుకు భక్తజనం పోటెత్తింది. అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి అమ్మవారిని దర్శించుకున్నారు.