Tiruchanuru Padmavathi Temple : తిరుచానూరు పద్మావతి అమ్మవారి పంచమి తీర్థానికి టీటీడీ ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మోత్సవాలు పూర్తయిన తర్వాత జరిగే చక్రస్నానాన్ని తిరుచానూరులో పంచమి అంటారు. లక్షలాది మంది భక్తులు ఈ తీర్థానికి హాజరవుతారు ముఖ్యంగా తమిళనాడు నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తారు. అందుకోసం టీటీడీ పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. భక్తుల కోసం తొలిసారి జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసింది. పోలీసులు ఇప్పటికే తిరుచానూరును నియంత్రణలోకి తీసుకుని పార్కింగ్ ప్లేస్లు కేటాయించారు. కలెక్టర్, ఎస్పీతో పాటు ఈవో ధర్మారెడ్డి టీటీడీ అధికారులు పుష్కరిణిని పరిశీలించారు