Nellore : నగలు తాకట్టు పెట్టేందుకు వచ్చామంటూ బంగారు తాకట్టు వ్యాపారి ఇంట్లోకి ముగ్గురు దొంగలు చొరబడ్డారు. ఈ ఘటన నెల్లూరు నగరంలోని నిత్యం జనసంచారం ఎక్కువగా ఉండే దేవిరెడ్డివారి వీధిలో చోటుచేసుకుంది. దుండగులు ఇంట్లోకి చొరబడి సేట్ గేవార్చంద్ జైన్ (75), విమల జైన్ (66) వృద్ధ దంపతులపై దాడి చేశారు. దాదాపు 25 లక్షల విలువైన బంగారాన్ని అపహరించారు.
సంఘటన స్థలానికి పోలీసులు చేరుకుని పరిశీలించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దొంగల దాడిలో గాయపడిన వృద్ధ దంపతులను ఆసుపత్రికి తరలించారు.