The High Court brakes on the movie ‘Rajadhani Files’: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అమరావతి రాజధాని అంశంపై తెరకెక్కిన చిత్రం ‘రాజధాని ఫైల్స్’. ఈ చిత్రానికి హైకోర్టులో ఎదురుదేబ్బ తగిలింది. సినిమా విడుదల నిలిపి వేయాలని కోరుతు పైసీసీ నేతలు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక స్టే ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో ఈ రోజు విడుదల కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడింది. విజయవాడలోని ట్రెండ్సెట్ మాల్లో అర్ధాంతరంగా ఈ సినిమా ప్రదర్శనను రెవెన్యూ అధికారలు నిలిపివేశారు. సినిమాను మధ్యలో ఆపివేయడంపై చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము టికెట్లు కొని చూస్తుంటే మధ్యలో నిలిపివేయడం సరికాదు అని ప్రశ్నించారు.
హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో చిత్రాన్ని ప్రదర్శించవద్దని నోటీసులు ఇచ్చారని.. ఉన్నత న్యాయస్థానం ఆదేశాలతోనే నిలిపివేశామని అధికారులు పేర్కొన్నారు. దానికి సంబంధించిన ఆర్డర్ కాపీని చూపించాలని ప్రేక్షకులు పట్టుబట్టారు.
Read More: ఐదేళ్లు అధికారాన్ని ఇస్తే ఏం చేశారు.. హైదరాబాద్ రాజధాని కొనసాగింపుపై షర్మిల మండిపాటు
ఇదిలా ఉండగా మరోపైపు గుంటూరు జిల్టా ఉండవల్లిలో సినిమా ప్రరదర్శన నిలిపివేయడంతో.. రైతులు ధర్నాకు దిగారు. ఉండవల్లి రామకృష్ణ థియేటర్లో సినిమా ప్రదర్శన నిలిపివేశారు. ఈ నేపథ్యంలో థియేటర్ వద్ద తెదేపా నేతలతో కలిసి రైతులు ఆందోళన చేపట్టారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో సినిమాను నిలిపివేసినట్లు యాజమాన్యం తెలిపింది.