TTD : తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్ను టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలియజేసింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. 2024-25 వార్షిక బడ్జెట్ను టీటీడీ ఆమోదం తెలిపింది. రూ. 5141.75 కోట్లతో వార్షిక బడ్జెట్ రూపొందించింది. నూతన వివాహం చేసుకోనే వధూవరులకు మంగళసూత్రాల విక్రయానికి బోర్డు ఆమోదం తెలియజేసింది. టీటీడీ పాలక మండలి సమావేశం అనంతరం వివరాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు.
మంగళ సూత్రాలు తయారు చేసి శ్రీవారి పాదాల చెంత ఉంచి విక్రయించాలని టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. అదే తరహాలో లక్ష్మీ కాసులను కూడా విక్రయించనున్నట్లు పేర్కొంది. ఎలాంటి లాభాపేక్ష లేకుండా కాస్ట్ టూ కాస్ట్ విక్రయించే విధంగా చర్యలు తీసుకునేందుకు చర్యలు తీసుకుంది. టీటీడీ దేవస్థానం పోటులో పనిచేసే 70 మంది స్కిల్డ్ కార్మికులను గుర్తించి.. వారి జీతాన్ని 15 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇదే తరహాలో 6 వేద పాఠశాలలో 51 మంది అధ్యాపకుల జీతాలను రూ. 35 వేల నుంచి రూ. 54 వేలకు పెంచుతున్నట్లు నిర్ణయించింది.
టీటీడీ ఆధ్వర్యంలోని 26 ఆలయాలు ఉన్నాయి. దేవస్థానం పరిధిలో 34 ఆలయాలలో భక్తులు సౌకర్యార్దం ఉద్యోగుల నియామకానికి ప్రభుత్వ అనుమతికి లేఖ రాశారు. గోగర్బం నుంచి ఆకాశగంగ వరకు నాలుగు వరుసల రోడ్ల నిర్మాణానికి 30 కోట్లు కేటాయించారు. నారాయణవనంలో కొలువైన భధ్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ది పనులకు 6.9 కోట్లు కేటాయించారు. స్విమ్స్ అభివృద్ది పనులుకు 148 కోట్లు కేటాయిస్తూ టీటీడీ ఆమోద ముద్ర వేసింది. రూ. 2.5 కోట్లతో సప్తగిరి అతిధి గృహలు అభివృద్ది పనులుకు. ఎస్ఏంసీ, ఎస్ఎన్ సీకాటేజీల అభివృద్ది పనులుకు 10 కోట్లు కేటాయించింది.
టీటీడీ దేవస్థానం హుండి ద్వారా 1611 కోట్లు వస్తోందని టీటీడీ పాలక మండలి అంచనా వేసింది. దర్శన టిక్కేట్లు విక్రయం ద్వారా 338 కోట్లు, వడ్డి ద్వారా 1,167 కోట్లు, ప్రసాదం విక్రయం ద్వారా 600 కోట్లను అంచనా వేసింది. జీతాలు చెల్లింపుకు 1.733 కోట్లు,కార్పస్ ఫండ్కుకి 750 కోట్లు, ముడిసరుకులు కోనుగోలుకు 751 కోట్లు, ఇంజనీరింగ్ పనులుకు 350 కోట్లు కేటాయించినట్లు టీటీడీ తెలిపింది.