BigTV English
Advertisement

TDP: వివేకా హత్య వ్యవహారంపై బుక్ రిలీజ్ చేసిన టీడీపీ

TDP: వివేకా హత్య వ్యవహారంపై బుక్ రిలీజ్ చేసిన టీడీపీ

TDP: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. కొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇటీవల ఈ కేసును సుప్రీంకోర్టు తెలంగాణ సీబీఐకి బదిలీ చేసింది. ఏపీలో తమకు న్యాయం జరగదని.. వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని వివేకా కూతురు సునీత సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో.. ఈ నిర్ణయం తీసుకుంది.


ఇక వివేకా హత్య జరిగిన తర్వాత చోటుచేసుకున్న పరిణామాలపై తెలుగు దేశం పార్టీ ఓ పుస్తకాన్ని రూపొందించింది. దానిని జగనాసుర రక్తచరిత్ర పేరుతో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, వర్ల రామయ్య, నిమ్మల రామానాయుడు, బొండ ఉమ తదితరులు శుక్రవారం విడుదల చేశారు. వివేకా హత్య కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవరనే దానిపై వివరిస్తూ పుస్తకాన్ని తీసుకొచ్చారు.

వైఎస్ వివేకాను చంద్రబాబే హత్య చేయించారని 2019 ఎన్నికల సమయంలో దుష్ప్రచారం చేసి సీఎం జగన్ అధికారంలోకి వచ్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. వివేకా గుండెపోటుతో చనిపోయాడని చెప్పి.. అవినాష్ రెడ్డి, భాస్కర్‌రెడ్డి హత్యకు సంబంధించిన ఆనవాళ్లు లేకుండా చేశారని అన్నారు. ఈ వ్యవహారంపై సీఎం జగన్ ఎందుకు నోరువిప్పడం లేదని ప్రశ్నించారు. ఈకేసులోని అంశాలను వివరిస్తూ.. వైసీపీ గుర్తింపు రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తామని వెల్లడించారు.


Related News

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Amaravati News: స్పీకర్ అయ్యన్న క్లారిటీ.. తేల్చుకోవాల్సింది ఎమ్మెల్యేలు, వైసీపీలో ముసలం ఖాయం?

AP Politics: ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్ రూ.400 కోట్ల బంగారం కొనుగోలు

AP Politics: జగన్ టూర్లు.. బుక్కవుతున్న వైపీసీ నేతలు.. బెంబేలెత్తుతున్నారెందుకు?

Big Stories

×