TDP Complaints to EC on YCP Social Media: ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల పోలింగ్ ముందురోజు వైసీపీ అరాచకాలు ఒకొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా టీడీపీపై వైసీపీ సోషల్మీడియా నెగిటివ్ ప్రచారం ముమ్మరం చేసింది. ఇంకోవైపు ఓటర్ల చేత గుడిలో వైసీపీ నేత ప్రమాణం చేయించడం వంటి పరిణామాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది టీడీపీ.
తాజాగా చంద్రబాబు ఓ న్యూస్ ఏజెన్సీకి ఇచ్చిన ఇంటర్వ్యూపై వైసీపీ నెగిటివ్ ప్రచారం మొదలుపెట్టింది. ఈ వ్యవహారంపై టీడీపీ నేత దేవినేని ఉమ.. ఏపీ ఎన్నికల కమిషనర్ ముఖేష్కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారు.
ఇంటర్వ్యూలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు అన్నట్లు మార్పింగ్ చేసిన వీడియోను వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని సీఈఓ ముకేశ్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేశారాయన.
Also Read: Janasena protest in Bhimavaram: అర్థరాత్రి జనసేన ఆందోళన, ఈవీఎంలు ప్రైవేటు కారులో తరలింపుపై
ఈ ప్రచారం వెనుక వైసీపీ సోషల్మీడియా ఇన్ఛార్జ్ సజ్జల భార్గవ్ రెడ్డి ఉన్నారు. వెంటనే ఆయనపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అందులో ప్రస్తావించారు. అంతేకాదు నకిలీ వీడియో ప్రచారం కాకుండా అడ్డుకోవాలని కోరారు ఉమ.
మరోవైపు తిరుపతిలోని కొర్ల గుంట ఆంజనేయస్వామి ఆలయంలో వైసీపీకి ఓటు వేయాలని ఓటర్లతో ప్రమాణాలు చేయించారు. తిరుపతి కో ఆపరేటివ్ బ్యాంక్ ఛైర్మన్ కేతన జయచంద్రారెడ్డిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు టీడీపీ నేత వర్ల రామయ్య. ఈ మేరకు ఆయన ఆదివారం రాష్ట్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. ముఖ్యంగా ఆటో సంఘాలకు చెందిన పలువురు నాయకులు కర్పూరం వెలిగించి తమ ఓటు, కుటుంబ, బంధువుల ఓట్లు వైసీపీ అభ్యర్థికి వేస్తామంటూ ప్రమాణం చేయించారు.
Also Read: Chandrababu pawan in Varanasi: వారణాసిలో బాబు, పవన్, ఎన్డీయే నేతలతో భేటీ
గత ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కేతం మాట్లాడిన వీడియో ఒకటి వివాదాస్పదమైంది. ఫేక్ పేపర్స్తో ఉదయం ఏడు గంటలకే పోలింగ్ కేద్రాలకు వెళ్లి వైసీపీకి ఓటు వేయాలని పిలుపునివ్వడం అప్పట్లో దుమారం రేపిన విషయం తెల్సింది.
ఎన్నికల కమిషన్కు దేవినేని ఉమా ఫిర్యాదు.
ఏఎన్ఐకి చంద్రబాబు ఇచ్చిన ఇంటర్వ్యూపై వైసీపీ సోషల్ మీడియా దుష్ప్రచారాలు చేస్తుంది
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల రిజర్వేషన్లు రద్దు చేస్తామని చంద్రబాబు చెప్పినట్లు ఫేక్ వీడియోను తయారు చేసి వైసీపీ అధికారిక ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్… pic.twitter.com/bDfY9DLpPP
— BIG TV Breaking News (@bigtvtelugu) May 12, 2024
తిరుపతి: ఓటర్లను ప్రలోబపేడుతున్న వైసీపీ నాయకులు. డబ్బులు తీసుకున్న వారిచేత ప్రమాణం చేయించిన టౌన్ బ్యాంక్ చైర్మన్ కేతం జయచంద్రారెడ్డి.#AndhraPradesh #Elections2024 #YSRCP #Tirupati #NewsUpdate #bigtvlive
@YSRCParty @ysjagan pic.twitter.com/3N4La5vVBR— BIG TV Breaking News (@bigtvtelugu) May 12, 2024