Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. నియోజకవర్గంలో పేరుకుపోయిన చెత్తా చెదారం సేకరణ చేపట్టారు. “వార్డులలో చెత్త పేరుకుపోయిందని, నీళ్లు రావడం లేదని ప్రజల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ప్రజల కోరిక మేరకే మేము చెత్త తొలగిస్తున్నాం” అని కేతిరెడ్డి తెలిపారు. మునిసిపల్ కార్మికులకు తాము వ్యతిరేకం కాదని.. ప్రజల కోసం ట్రాక్టర్లతో చెత్తను తొలగిస్తున్నామని ఎమ్మెల్యే కేతిరెడ్డి తెలిపారు.
జీతాలు పెంచాలని తాము నిరసన వ్యక్తం చేస్తుంటే.. చెత్త సేకరణ చేయడం దారుణం అంటూ మున్సిపల్ కార్మికులు ఎమ్మెల్యేను అడ్డుకున్నారు. 12 రోజుల నుంచి ఎక్కడ చెత్త అక్కడే పేర్కొందని.. ఈగలు, దోమలతో అనారోగ్యం పాలవుతున్నామని పారిశుద్ధ్య కార్మికులతో ప్రజలు వాదనకు దిగారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చెత్త తొలగిస్తున్న ఎమ్మెల్యేను అడ్డుకున్న నేతలు, కార్మికులను స్టేషన్ కు తరలించారు.