నాదెండ్ల మనోహర్. తెనాలి నియోజకవర్గం నుంచి జనసేన తరపున పోటీ చేసి గెలుపొందారు. ఇప్పటివరకు ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి స్పీకర్గానూ పనిచేశారు. జనసేన పార్టీలో నెంబర్ 2గా నాదెండ్ల ఉన్నారు.
కందుల దుర్గేష్. ఉభయగోదావరి జిల్లాల్లో జనసేన కీలక నాయకుడు. గతంలో MLCగా పనిచేసిన అనుభవం ఉంది. ఈ సారి ఆయన నిడదవోలు నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. జనసేన నుంచి ఆయనకు మంత్రి పదవి దక్కింది.
Also Read: చంద్రబాబు కేబినెట్, సీనియర్లు సైలెంట్.. రకరకాల చర్చలు,
ధర్మవరం అసెంబ్లీ నుంచి కూటమి బలపరిచిన అభ్యర్ధిగా సత్య కుమార్ శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర కేబినెట్లో ఆయన BJP నుంచి చోటు దక్కించుకున్నారు. వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా సుదీర్ఘ కాలంపాటు కొనసాగారు. BJP జాతీయ కార్యదర్శిగా పనిచేశారు. AP బీజేపీ నుంచి కేంద్రం నాయకత్వంతో ఆయనకు అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. దీంతో సత్య కుమార్కే కేబినెట్ బెర్త్ లభించింది. నాగిరెడ్డి తర్వాత ధర్మవరానికి తొలిసారి మంత్రి పదవి దక్కినట్టైంది.
ప్రస్తుత సీనియర్ ఎమ్మెల్యేల్లో అచ్చెన్నాయుడు ఒకరు. గతంలో హరిశ్చంద్రాపురం నియోజకవర్గం నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత టెక్కలి నుంచి 2014, 2019, 2024లో వరుసగా గెలిచారు. ప్రస్తుతం ఆయన ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. గతంలోనూ మంత్రిగా చేసిన అనుభవం ఉంది. ప్రత్యేకించి చంద్రబాబు జైల్లో ఉన్న