EPAPER

Amaravati: అమరావతి కేసులో జగన్‌కు షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Amaravati: అమరావతి కేసులో జగన్‌కు షాక్.. సుప్రీంకోర్టులో చుక్కెదురు..

Amaravati: అమరావతిపై ఏపీ సర్కారు ముందడుగు వేయడం లేదు. రాజధాని రైతులు పట్టు వీడటం లేదు. మూడు రాజధానులు వద్దు.. అమరావతినే ముద్దు.. అంటూ స్థానికులు హైకోర్టుకు వెళ్లారు. అమరావతి నిర్మాణం పూర్తి చేయాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చింది. అయితే, దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. తాజాగా అక్కడా చుక్కెదురైంది.


అమరావతి విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాదులు కోరగా.. స్టే ఇచ్చేందుకు సుప్రీం ధర్మాసనం నిరాకరించింది. కేసు విచారణ వీలైనంత త్వరగా చేపట్టాలని విజ్ఞప్తి చేయగా.. సుప్రీంకోర్టు సున్నితంగా తిరస్కరించింది. ఈ కేసులో అనేక మంది ప్రతివాదులు ఉన్నారని.. వారందరి వాదనలు వినాల్సి ఉందని తెలిపింది. తాము ఇతర కేసులు కూడా విచారించాల్సి ఉందంటూ ఒకింత ఘాటుగానే స్పందించింది.

కనీసం వచ్చే నెలలోనైనా విచారణ జరపాలని ఏపీ తరఫు న్యాయవాదులు అభ్యర్థించగా.. కేసును జులై 11కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు ధర్మాసనం.


Related News

Kadambari Jethwani Case: బ్రేకింగ్ న్యూస్.. జెత్వానీ కేసులో ప్రముఖ నేత అరెస్ట్!

YS Jagan: సూపర్ స్వామి, జీర్ణవ్యవస్థ.. మళ్లీ టంగ్ స్లిప్ అయిన జగన్

Chandhrababu: ఇప్పుడు జనంలో కనిపించినట్టు జగన్.. సీఎంగా ఉన్నప్పుడు కనిపించేవాడా? : చంద్రబాబు

Kethireddy: ఇప్పటికైనా నోరు తెరువు సామీ.. ఇంకా ఎందుకు మౌనంగా ఉంటున్నావ్..? : కేతిరెడ్డి

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 కోట్లు వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Big Stories

×