Srisailam : నంద్యాల జిల్లా శ్రీశైలం ప్రధాన ఆలయం సమీపంలోని దుకాణాల తరలింపుతో ఉద్రిక్తత నెలకొంది. దుకాణదారులు గంగాధర మంటపం వద్ద కూర్చుని ధర్నాకు దిగారు.
ఈవోకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎమ్మెల్యే వచ్చి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఖాళీ చేయడానికి సమయం ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారని అధికారులపై మండిపాటు.
దుకాణాల తొలగింపు కోసం ఇచ్చిన గడువు ముగిసిందని అధికారులు తెలిపారు. జేసీబీతో దుకాణాలు తొలగించారు