Srisailam : శ్రీశైలం దేవస్థానం పరిధిలో 3 రోజుల క్రితం ఎలుగుబంటి, చిరుత సంచార కలకలం రేపడంతో దేవస్థానం అధికారులు అలర్ట్ అయ్యారు. భక్తులు ఎటువంటి ఇబ్బందులు, భయాందోళనలకు లేకుండా టీటీడీ తరహాలోనే రక్షణ చర్యలు చేపట్టామని ఈవో తెలిపారు.
అటవీ శాఖ అధికారులతో క్రూర జంతువుల సంచారంపై చర్చించామని.. రక్షణ చర్యల్లో భాగంగా ఇకపై దేవస్థానం చుట్టూ టపాసులు కాల్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
దేవస్థానం పరిధిలోకి జంతువులు రాకుండా ఫెన్సింగ్ ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించామన్నారు. అటవీశాఖ అనుమతులు వచ్చిన వెంటనే ఫెన్సింగ్ ఏర్పాటు పనులను ప్రారంభిస్తామని ఈవో అన్నారు.