Crime News: పొట్టకూటి కోసం కర్ణాటక రాష్ట్రం బళ్లారి నుండి వచ్చిన ఇద్దరు మహిళలపై దుండగులు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలంలోని ఓ గ్రామంలో ఐదు నెలల క్రితం బళ్లారి నుండి వచ్చిన ఓ కుటుంబం నివసిస్తోంది. వీరు స్థానిక పేపర్ మిల్లులో పని చేస్తూ.. జీవన మనుగడ సాగిస్తున్నారు.
ఇద్దరు మహిళలపై సామూహిక లైంగిక దాడి
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం నల్లబొమ్మనిపల్లిలో ఘటన
ఐదు నెలల క్రితం బళ్ళారి నుంచి వచ్చి, నిర్మాణంలో ఉన్న పేపర్ మిల్లులో వాచ్మెన్లుగా పనిచేస్తున్న ఓ కుటుంబం
నిన్న అర్ధరాత్రి రెండు బైక్లపై వచ్చిన ఐదుగులు దుండగులు… pic.twitter.com/tv8krhRw3u
— BIG TV Breaking News (@bigtvtelugu) October 12, 2024
ఈ కుటుంబంలో ఓ వ్యక్తి స్థానిక పేపర్ మిల్లులో వాచ్ మెన్ గా పనిచేస్తున్నారు. అయితే రోజువారి మాదిరి గానే.. రాత్రి కాగానే కుటుంబ సభ్యులు నిద్రలోకి జారుకున్నారు. ఈ సమయంలో ద్విచక్ర వాహనాలపై ఐదుగురు దుండగులు అక్కడికి చేరుకున్నారు. ఆ తర్వాత ఇంట్లోకి చొరబడి తండ్రి, కొడుకులను కత్తితో బెదిరించినట్లు బాధితులు తెలుపుతున్నారు. బెదిరించిన అనంతరం అత్తాకోడళ్లను పక్కకు తీసుకెళ్లి దుండగులు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ విషయం దావానంలా వ్యాప్తి చెందడంతో.. స్థానికులు అసలేం జరిగింది.. ఎవరు వారు అంటూ ఆరా తీస్తున్నారు.
లైంగిక దాడి విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు, బాధితులను విచారించారు. ద్విచక్ర వాహనాలపై వచ్చి మూకుమ్మడిగా లైంగిక దాడికి పాల్పడ్డ నిందితులను గుర్తించేందుకు పోలీసులు ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో.. పలు బృందాలుగా విడిపోయి.. ఈ ఘాతుకానికి పాల్పడ్డ వారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు. ఈ ఘటనపై మంత్రి సవిత కూడా స్పందించారు. సాధ్యమైనంత త్వరగా నిందితులను పోలీసులు పట్టుకుంటారని మంత్రి తెలిపారు.