EPAPER
Kirrak Couples Episode 1

Sri Satya Sai District : ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీ చెలగాటం.. నాటు వైద్యం వికటించి ఇద్దరి మృతి..

Sri Satya Sai District : ప్రజల ప్రాణాలతో ఆర్ఎంపీ చెలగాటం.. నాటు వైద్యం వికటించి ఇద్దరి మృతి..

Sri Satya Sai District : శ్రీ సత్యసాయి జిల్లాలో ఓడీసీ మండలంలో దారుణం చోటు చేసుకుంది. నాటు వైద్యం పేరుతో ఓ ఆర్ఎంపీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. టి.కుంట్లపల్లి, బసప్పగారి పల్లెల్లో విషాదం నెలకొంది. మోకాళ్ల నొప్పులు బాగుచేస్తానంటూ అంటూ ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఇచ్చిన సూది మంది వికటించి ఇద్దరు మరణించారు. మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉండటంతో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.


మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న పలు గ్రామాలకు చెందిన 30 మంది.. అమడగూరు మండలం పూలకుంట్లపల్లిలో ఈనెల 3న చిత్తూరు జిల్లా వాయల్పాడుకు చెందిన ఓ ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. వీరందరికీ ఆర్ఎంపీ సూది మందు ఇచ్చాడు. సూది మందు తీసుకున్న రోజు నుంచి టి.కుంట్లపల్లికి చెందిన పప్పురమ్మ, ఓబులేసు, సాహెబ్ పీరాలకు మోకాళ్ల నొప్పులు అధికమయ్యాయి.

వీరితోపాటు బసప్పగారిపల్లికి చెందిన రామప్ప, ఉత్తన్నలకు మోకాళ్ల నొప్పులు పెరిగిపోయాయి. విపరీతంగా వాపులు రావడంతో తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. వీరిలో పప్పురమ్మ, రామప్పల పరిస్థితి విషమించి మరణించారు. ఓబులేసు, సాహెబ్ పీరా, ఉత్తన్నల పరిస్థితి విషమంగా ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. పప్పురమ్మ, రామప్ప మృతితో గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి. బంధువుల ఆర్తనాదాలలు మిన్నంటాయి. ప్రభుత్వం ఆర్ఎంపీ వైద్యునిపై వెంటనే చర్యలు చేసుకోవాలని బాధితుల బంధువులు కోరుతున్నారు.


Tags

Related News

Roja Comments On Pawan: పవన్ కి ఏం తెలీదు.. బాబుకు బుద్ది లేదు.. ఓ రేంజ్ లో రెచ్చిపోయిన మాజీ మంత్రి రోజా

AP Govt: సలహా ఇవ్వండి.. సర్టిఫికెట్ తీసుకోండి.. ఏపీ సీఎం ఐడియా అదిరింది కదూ..

Jagan: జగన్ అనుకున్నదొక్కటి, అయ్యిందొక్కటి.. 12వ సారి..

Perni Nani: మసీదుకు వెళ్లి ప్రార్ధన చేసే చంద్రబాబు నిఖార్సైన హిందువా.. పేర్ని నాని కీలక వ్యాఖ్యలు

Road roller: విషాదం.. ఒకరి నిర్లక్ష్యం.. ఇద్దరు యువకులు బలి!

Roja new plan: పవన్ పై వ్యతిరేకత.. తమిళనాడులో రోజా బిజి బిజీ, ప్లాన్ ‘అదిరింది’

Tirupati Laddu Supreme Court : తిరుపతి లడ్డూ వివాదంపై సుప్రీం కోర్టులో పిటీషన్లు.. సెప్టెంబర్ 30న విచారణ

Big Stories

×