Amaravathi Mahapadayatra : అమరావతి రైతలు మహాపాదయాత్ర ఇవ్వాల్టితో 36వ రోజులోకి అడుగుపట్టింది. ఈ రోజు కొవ్వూరు నుంచి యాత్ర ప్రారంభమైంది. అమరావతి రైతులు సుమారు 15 కిలోమీటర్ల వరకు పాదయాత్ర చేశారు. హోం మంత్రి తానేటి వనిత సొంత నియోజకవర్గం కావడంతో పోలీసులు ఆంక్షలు విధించి ఎక్కువ సంఖ్యలో మోహరించారు. పాదయాత్ర రూట్ మార్చుకోవాలని పోలీసులు జేఏసీ నేతలకు నోటీసులిచ్చేందుకు వెళ్తుండగా.. జేఏసీ నేతలను దాన్ని తిరస్కరించారు.
అమరావతి మహాపాదయాత్రకు ఉభయ గోదావరి జిల్లాల్లోంచి 50వేల మంది రైతులు పాదయాత్రలో పాల్గొని సంఘీభావం తెలుపుతామని కొవ్వూరు టీడీపీ ద్విసబ్య కమిటీ సభ్యులు జొన్నటగడ్డ సుబ్బరాయ చౌదరి, కంఠమని రామకృష్ణారావు అన్నారు. రైతుల పాదయాత్ర వస్తున్న విశేష స్పందన చూసే వైకాపా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తోందన్నారు జేఏసీ నేతలు. పాదయాత్రకు రాష్ట్ర కాపు సంఘం నాయకుడు వంగవీటి రాధ కూడా మత్తదు తెలుపనున్నట్లు ప్రకటించారు.