Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చామని టీడీపీ పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్ని కోరినట్లు తెలిపారు.
Chandrababu: టీడీపీ నిర్ణయం మేరకే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ ఇచ్చామని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వారిపై చర్యలు తీసుకొవాలని స్పీకర్ని కోరినట్లు తెలిపారు.
వైసీపీలో చేరిన టీడీపీ ఎమ్మెల్యేలు వాసుపల్లి గణేష్, కరణం బలరాం, వల్లభనేని వంశీ, మద్దాలి గిరిని అనర్హులుగా ప్రకటించాలని పార్టీ విప్ డోలా బాలవీరాంజనేయస్వామి పిటిషన్ వేశారు. డోలా ఇచ్చిన అనర్హత పిటిషన్పై శాసనసభ స్పీకర్ చంద్రబాబు అభిప్రాయాన్ని కోరారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని స్పీకర్కు చంద్రబాబు తెలియజేశారు.