Trains Cancelled | మిచౌంగ్ తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 144కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారి సీహెచ్ రాకేశ్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది.
మిచౌంగ్ తుఫాను కారణంగా దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 144కి పైగా రైళ్లు రద్దు చేస్తున్నట్లు రైల్వే ఉన్నతాధికారి సీహెచ్ రాకేశ్ తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శుక్రవారం ఉదయం వాయుగుండంగా మారింది. ఈ అల్పపీడనం ఆదివారానికి తుఫానుగా బలపడనుంది. ఈ తుఫానుని మిచౌంగ్ తుఫాను అని నామకరణం చేశారు.
మిచౌంగ్ తుఫాను ప్రభావంతో ఆదివారం, సోమవారం రెండు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని భారీ వర్షాలలు కురిసే అవకాశం ఉంది. ఈ కారణంగా డిసెంబర్ 3 నుంచి డెసెంబర్ 6వ తేదీ వరకు వివిధ రైళ్లను రద్దు చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మరి కొన్ని రైళ్లను పాక్షికంగా రద్దు అయ్యాయి. రద్దైన రైళ్ల జాబితా ఇదే..