Krishna : ఈమధ్య కాలంలో వన్యప్రాణులు జనజీవన స్రవంతిలోకి వచ్చేస్తున్నాయి. పాములు, ఏనుగులు, ఎలుగుబంట్లు జనాల మధ్యకు వచ్చి.. కార్లు, స్కూటర్లు, చెట్లు ఎక్కేస్తున్నాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం కలెక్టరేట్లో ఓ పాము కలకలం సృష్టించింది.
జిల్లా రెవెన్యూ అధికారి ఛాంబర్ పక్కనే ఉన్న క్యాబిన్లోకి చేరిన త్రాచుపాము.. ఉద్యోగులను తీవ్ర భయబ్రాంతులకు గురి చేసింది. పామును చూసిన ఉద్యోగులు కార్యాలయం నుంచి బయటకు పరుగులు తీశారు. గంటపాటు సిబ్బందిని ముప్పతిప్పలు పెట్టింది.
అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వడంతో.. కలెక్టేట్కు చేరుకున్నారు సిబ్బంది. పాములు పట్టే వ్యక్తి సహాయంతో క్యాబిన్లో ఉన్న పామును పట్టుకుని నిర్మాణుష్య ప్రాంతంలో విడిచిపెట్టారు. దీంతో కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.