EPAPER

Slab Collapsed: ఘోర విషాదం.. నిద్రలోనే చనిపోయారు!

Slab Collapsed: ఘోర విషాదం.. నిద్రలోనే చనిపోయారు!

Slab Collapsed in Nandyal District(AP news today telugu): నంద్యాల జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. భారీ వర్షాలకు అర్ధరాత్రి మట్టి మిద్దె కూలి నలుగురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో రోదనలు మిన్నంటాయి. చాగలమర్రి మండలంలోని చిన్న వంగలిలో మట్టి మిద్దె కూలడంతో నలుగురు నిద్రలోనే మృతి చెందారు. మృతుల్లో దంపతులతోపాటు ఇద్దరు పిల్లలు ఉన్నారు.


భార్యభర్తలు గురుశేఖర్ రెడ్డి(45), దస్తగిరమ్మ(38), ఇద్దరు కుమార్తెలు పవిత్ర(16), గురులక్ష్మి(10) రాత్రి భోజనం చేసిన తర్వాత నిద్రపోయారు. అయితే రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మట్టి మిద్దె కూలింది. ఉదయం స్థానికులు చూసే సరికి ఇల్లు కూలింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.

Also Read: జగన్ పరిస్థితి ఏంటి, వెంకట్‌రెడ్డి ఎక్కడ? రంగంలోకి ఏసీబీ..


శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను గ్రామస్తులు వెలికితీశారు. అయితే వీరికి ముగ్గురు కుమార్తెలు కాగా.. మరో కుమార్తె ప్రసన్న పొద్దుటూరులో హాస్టల్ లో ఉంటూ చదువుకుంటున్నట్లు గ్రామస్తుల తెలిపారు. కుటుంబంలో ఒకేసారి నలుగురు మృతి చెందడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఇదిలా ఉండగా, ఇటీవల కురిసన భారీ వర్షాలకు ఇల్లు పూర్తిగా తడిచి, శిథిలావస్థకు చేరి కూలినట్లు తెలుస్తోంది.

Related News

Balineni Srinivasa Reddy: వైసీపీకి రాజీనామా.. జనసేనలోకి బాలినేని? ముహూర్తం ఫిక్స్!

Mumbai actress case: కాదంబరీ జెత్వానీ కేసులో ఓ ఐఏఎస్.. అప్రూవర్‌గా మారేందుకు ఐపీఎస్ ప్రయత్నాలు..

Inquiry on Sakshi Newspaper: జగన్ చిక్కినట్టేనా.. క్విడ్ ప్రోకో, సాక్షి పత్రిక కొనుగోళ్లపై

Tirupati Laddu: దేవుడిపై ప్రమాణానికి చంద్రబాబు కుటుంబం సిద్ధమా?

Free Gas Cylinders: భారీ శుభవార్త.. దీపావళి నుంచి ఉచితంగా గ్యాస్ సిలిండర్ల పంపిణీ

Tirupati Laddu: తిరుపతి లడ్డూలపై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. ప్రసాదంలో జంతువుల కొవ్వు వాడారంటూ సీరియస్

Pavan Kalyan: ఈ వయసులోనూ ఆయన పనిచేస్తున్న తీరును చూసి నాకు ఆశ్చర్యం వేస్తుంది: పవన్ కల్యాణ్

Big Stories

×