Sharmila demanding response on Sattenapalli Incident(AP politics): సత్తెనపల్లిలో యూత్కాంగ్రెస్పై జరిగిన దాడిని పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఖండించారు. ఏపీలో పోలీసులు వైకాపా కండువా లేని కార్యకర్తలు అని విమర్శించారు. సత్తెనపల్లిలో యూత్కాంగ్రెస్ నాయకులపై పోలీసులు, వైకాపా గూండాలు దాడి చేశారు అన్నారు. పోలీసులు ప్రజల కోసం పని చేయాలి.. కాని ఏపీలో మాత్రం అధికార పార్టీ అడుగులకు మడుగులు ఒత్తడం కోసమే పోలీసులు ఉన్నారు అంటూ ట్విటర్ ద్వరా ప్రశ్నించారు.
Read More: ధ్యాత్మిక సేవలో చంద్రబాబు.. నివాసంలో రాజశ్యామల యాగం..
ప్రజాస్వామ్య బద్ధంగా నిరసిస్తే గొంతు నులిమి చంపాలని చూడటంతో పాటు బూట్లతో తొక్కిస్తారా అని మండిపడ్డారు. వైకాపా గూండాలను పక్కన పెట్టి మరీ దాడులు చేయిస్తున్నారు.. మీరు పోలీసులా లేక వైకాపా కిరాయి గూండాల అని నిలదీశారు.
ఇష్టారాజ్యంగా కొట్టడానికి మీకు హక్కులు ఎవరిచ్చారు అని పోలీసులపై విరుచుకుపడ్డారు. ఏపీలో పోలీసులు కండువా లేని వైకాపా కార్యకర్తలు అని విమర్శించారు. సత్తెనపల్లి ఘటనలో తమ నాయకులను విచక్షణారహితంగా కొట్టిన పోలీసు సిబ్బందిని వెంటనే సస్పండ్ చేస్తూ.. డీజీపీ వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు.