Kakinada : కాకినాడ జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన జరిగింది. పెద్దాపురం మండలం జి.రాగంపేటలో కొత్తగా నిర్మిస్తున్న ఫ్యాక్టరీలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. ఈ ఘటన అంబటి సుబ్బన్న ఆయిల్ ఫ్యాక్టరీలో జరిగింది.
మృతుల్లో ఐదుగురిని పాడేరు వాసులుగా గుర్తించారు. వారిని కుర్రా రామారావు, వెచ్చంగి కృష్ణ , వెచ్చంగి నరసింహ, వెచ్చంగి సాగర్, కురతాడు బంజిబాబుగా గుర్తించారు. మరో ఇద్దరని పెద్దాపురం మండలం పులివేరు చెందిన కట్టమూరి జగదీశ్, ప్రసాద్ గా నిర్ధారించారు. కార్మికులు ఆయిల్ ట్యాంకర్ శుభ్రం చేస్తుండగా ఊపిరాడక ప్రాణాలు కోల్పోయారు. ఏడుగురు కార్మికుల మృతితో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలో మునిగిపోయాయి.