MARGADARSHI (Latest AP News ) : ఖాతాదారులను మోసం చేసిన కేసు విషయంలో మార్గదర్శి చిఫ్ ఫండ్స్ పై ఏడు కేసులు నమోదు చేసినట్లు ఏపీ సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ ప్రకటించారు. మార్గదర్శి చిట్ ఫండ్ యాజమాన్యం ప్రభుత్వ నియమనిబంధనలన్నింటినీ ఉల్లంఘించిందని అడిషనల్ డీజీ చెప్పారు. ఇదే కేసు విషయంలో ఒక వెయ్యి 35 కోట్ల రూపాయల ఆస్తులను ఏపీ ప్రభుత్వం అటాచ్ చేసిందని ఆయన ప్రకటించారు. ఇక సీఐడీ పనితీరుపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు ప్రచారం చేయడాన్ని అడిషనల్ డీజీ సంజయ్ తప్పుపట్టారు.