Andhra Pradesh today news : ఏపీలో వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచేస్తున్నాయి. గరిష్ట ఉష్టోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు పొడిగించాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కానీ ప్రభుత్వం పాఠశాలలను యథాప్రకారమే తెరచేందుకు మొగ్గు చూపింది.
సెలవులు పొడిగించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం నేపథ్యంలో ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17 వరకు ఒక పూట బడులు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది.ఇలా సెలవులు పొడిగించకుండా ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.