EPAPER
Kirrak Couples Episode 1

AP : రేపటి నుంచి బడులు.. అప్పటి వరకు ఒంటి పూటే క్లాసులు..

AP : రేపటి నుంచి బడులు.. అప్పటి వరకు ఒంటి పూటే క్లాసులు..


Andhra Pradesh today news : ఏపీలో వేసవి సెలవులు ముగిశాయి. సోమవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. కొన్నిరోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎండలు దంచేస్తున్నాయి. గరిష్ట ఉష్టోగ్రతలు 45 డిగ్రీలు దాటి నమోదవుతున్నాయి. వడగాల్పులు వీస్తున్నాయి. ఈ నేపథ్యంలో పాఠశాలలకు సెలవులు పొడిగించాలని ప్రతిపక్ష పార్టీలు, ఉపాధ్యాయ సంఘాలు కోరాయి. కానీ ప్రభుత్వం పాఠశాలలను యథాప్రకారమే తెరచేందుకు మొగ్గు చూపింది.

సెలవులు పొడిగించడానికి ఏపీ ప్రభుత్వం అంగీకరించలేదు. అయితే అధిక ఉష్ణోగ్రతలు, వేడిగాలుల ప్రభావం నేపథ్యంలో ఒంటి పూట బడులు నిర్వహించాలని నిర్ణయించింది. ఈ నెల 17 వరకు ఒక పూట బడులు పెట్టాలని ఉత్తర్వులు జారీ చేసింది.


ఉదయం 7.30 గంటల నుంచి 11.30 గంటల వరకు మాత్రమే తరగతులు నిర్వహించాలని సర్కార్ ఆదేశాలిచ్చింది.ఇలా సెలవులు పొడిగించకుండా ఒంటి పూట బడుల నిర్వహణకే ప్రభుత్వం మొగ్గు చూపింది. ఈ నెల 19 నుంచి విద్యా ప్రణాళిక షెడ్యూల్ ప్రకారం పాఠశాలలు పూర్తిస్థాయిలో నడుస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Tags

Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×