SANKRANTI RETURN JOURNEY : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా.. అంబరాన్నంటేంత సందడి సాగాయి. ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే, ఈ మూడ్రోజులపాటు చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి తరలివెళ్లి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. రకరకాల పిండి వంటలు, కనుల విందు చేసే రంగవల్లులు, కోడి పందేలు, గుండాట, ప్రభల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార, సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్ట కూటి కోసం నగరం బాట పట్టారు.
Sankranti Return Journey : తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా.. అంబరాన్నంటేంత సందడి సాగాయి. ఈ నెల 14న భోగి మంటలతో సంక్రాంతి సంబురాలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత సంక్రాంతి, కనుమతో పండుగ ముగిసింది. అయితే, ఈ మూడ్రోజులపాటు చిన్నా పెద్దా అంతా పట్నం నుంచి తరలివెళ్లి తమ సొంతూళ్లలో సందడిగా గడిపారు. రకరకాల పిండి వంటలు, కనుల విందు చేసే రంగవల్లులు, కోడి పందేలు, గుండాట, ప్రభల తీర్థం ఇలా పండుగ మూడు రోజులు తమ ఆచార, సంప్రదాయాలను ఆచరిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, చిన్ననాటి స్నేహితులతో జనం పండుగ సంతోషాన్ని ఆస్వాదించి తిరిగి పొట్ట కూటి కోసం నగరం బాట పట్టారు.
పండుగ ముగియడంతోపాటు రేపటి నుంచి పాఠశాలలు పునఃప్రారంభంకానున్న నేపథ్యంలో సొంతూరును విడిచి మళ్లీ నగరం బాట పట్టాల్సిన పరిస్థితితో అంతా సిటీకి రావడానికి సిద్ధమయ్యారు. కొందరైతే ఈ తెల్లవారుజాము నుంచే ప్రయాణం కాగా… రేపు మరింత మంది తరలివచ్చే అవకాశముంది. ఇదిలా ఉంటే,.. దాదాపు బస్సులు, రైళ్ల రిజర్వేషన్లు పూర్తికావడంతో తిరుగు ప్రయాణంలోనూ జనానికి అవస్థలు తప్పడం లేదు. ఇక రిటర్న్ జర్నీ సందర్భంగా ఏపీలో ఇప్పటికే బస్టాండ్లు, రైల్వేస్టేషన్ల వద్ద ప్రయాణికులతో కోలాహాలం నెలకొంది. సంక్రాంతి తిరుగు ప్రయాణంతో మళ్లీ రోడ్లన్నీ కిక్కిరిపోనున్నాయి. దీంతో హైవేలపై ఉన్న టోల్ప్లాజా వద్ద వాహనాల రద్దీ నెలకొననుంది. ఈ నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలకు సిద్ధమయ్యారు.
సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11, 12వ తేదీల్లో ఏపీ సహా తెలంగాణ జిల్లాల వాసులు హైదరాబాద్ నుంచి సొంతూళ్లు తరలివెళ్లారు. దీంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై గల పలు టోల్ప్లాజాల వద్ద వాహనాలు బారులు తీరి ట్రాఫిక్ జామ్ అయింది. అయితే, మూడు రోజులుపాటు సాగిన పండుగ సంబురాలు ముగియడంతో తిరిగి జనం పల్లె నుంచి నగరం బాట పట్టడంతో సూర్యాపేట జిల్లాలోని పంతంగి టోల్ప్లాజాతోపాటు మరిన్ని టోల్ల వద్ద వాహనాల రద్దీ నెలకొనున్న నేపథ్యంలో అధికారులు ట్రాఫిక్ నియంత్రణ చర్యలపై ఫోకస్ పెట్టారు. ఇక పండుగ సందర్భంగా పట్నం నుంచి పల్లెలకు వెళ్తున్న సమయంలో పలుచోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగి విషాదాన్ని నింపాయి. వరుస ప్రమాదాలు అందరినీ కలిచివేశాయి. ఈ తరుణంలో రవాణా అధికారులు అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ తగదని హెచ్చరిస్తున్నారు. వెళ్లేటప్పుడు ఎంత సేఫ్గా వెళ్లారో తిరిగి వచ్చేటప్పుడు అంతే జాగ్రత్తగా రావాలని సూచిస్తున్నారు. గమ్యం చేరే సమయంలో ఓవర్ స్పీడ్ పనికిరాదని.. నిర్లక్ష్య ధోరణి వీడి డ్రైవింగ్ చేయాలని చెబుతున్నారు.