Sankranti Celebrations : ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరూ వాడలా పండుగ సందడి నెలకొంది. రకరకాల పిండి వంటలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నలు, గుండాటలు, కోడిపందేలతో ఎటు చూసినా ఫెస్టివల్ కోలాహలం కనిపిస్తోంది. ఇక పండుగ సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్నవారంతా సొంత ఊరికి చేరుకుని సంబరాల్లో మమేకవుతుండటంతో పండుగ కళతో పల్లెలు మురిసిపోతున్నాయి. మరోపక్క పండుగ సందర్భంగా పలు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
Sankranti Celebrations : ఏపీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. ఊరూ వాడలా పండుగ సందడి నెలకొంది. రకరకాల పిండి వంటలు, భోగి మంటలు, రంగవల్లులు, హరిదాసు కీర్తనలు, డూడూ బసవన్నలు, గుండాటలు, కోడిపందేలతో ఎటు చూసినా ఫెస్టివల్ కోలాహలం కనిపిస్తోంది. ఇక పండుగ సందర్భంగా ఎక్కడెక్కడ ఉన్నవారంతా సొంత ఊరికి చేరుకుని సంబరాల్లో మమేకవుతుండటంతో పండుగ కళతో పల్లెలు మురిసిపోతున్నాయి. మరోపక్క పండుగ సందర్భంగా పలు ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
ఇక కోడిపందేలకు ఉభయగోదావరి జిల్లాలు ఫేమస్. అందుకే ఎప్పటిలాగానే పోలీసులు ఎన్ని నిబంధనలు పెట్టినా వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా కోడిపందేలు జోరుగా నిర్వహిస్తున్నారు. అటు ఈ కోడిపందాలపై హైకోర్టు కూడా నిషేధం విధించింది. కోడి పందేలు నిర్వహించడం మూగ జీవాలపై క్రూరత్వమేనని.. వాటిని నిలువరించాలని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతోపాటు కృష్ణా, గుంటూరు జిల్లా కలెక్టర్లను ఆదేశించింది.
అయితే,.. కోర్టు ఆదేశాలను కూడా లెక్క చేయకుండా పలుమైదానాల్లో బరులు ఏర్పాటు చేశారు నిర్వాహకులు. దీంతో కోడి పందేల జాతర సాగుతోంది. పలు చోట్ల పందెం రాయుళ్లు కోట్లలో బెట్టింగ్కాస్తున్నట్టు తెలుస్తోంది. ప్రజా ప్రతినిధులు సైతం ఈ పోటీలను దగ్గరుండి నిర్వహిస్తున్నారు. ఈ పందేలను చూడడానికి ఏపీ నలు మూలల నుంచే కాదు ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం తరలివచ్చారు. దీంతో బరుల వద్ద పెద్ద ఎత్తున జన కోలాహాలం నెలకొంది.