Sad Incident in Thottambedu: తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రమాదం జరగగా. .ఆ ప్రమాద స్థలాన్ని చూపించేందుకు వెళ్లిన ఓ అటవీశాఖ ఒప్పంద ఉద్యోగి ప్రమాదానికి గురై మృతి చెందాడు. ఈ సంఘటన జిల్లాలోని తొట్టంబేడు మండలం పెద్దకన్నలి గ్రామ సమీపంలో నాయుడుపేట-మదనపల్లి జాతీయ రోడ్డుపై చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. తొట్టంబేడు మండలం బసవయ్యపాలెం ఎస్టీ కాలనీకి చెందిన వెంకటేష్ (35 15 ఏళ్లుగా బసవయ్యపాలెం చెక్పోస్టు వద్ద ఒప్పంద ఫారెస్ట్ వాచర్గా విధులు నిర్వహిస్తున్నారు. అయితే పెద్దకన్నలి దగ్గరలో ఓ రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ట్రాక్టర్, కేరళ బస్సు బలంగా ఎదురెదురుగా ఢీకొట్టుకున్నాయి. ఈ ప్రమాద సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి బయలుదేరారు.
అయితే అక్కడే విధుల్లో ఉన్న వెంకటేష్ ను వెంట తీసుకెళ్లారు. ప్రమాదం జరిగిన ప్రాంతానికి వెళ్తుండగా.. పోలీస్ వాహనాన్ని మరో లారీ వేగంగా వచ్చి ఢీకొట్లింది. ఈ ప్రమాదంలో వెంకటేష్ స్పాట్ లోనే దుర్మరణం చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.