Porumamilla : తల్లిబిడ్డల ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం లక్ష్యం నీరుగారిపోతోంది. కడప జిల్లా పోరుమామిళ్ల అంగన్వాడీ సెంటర్ లో లబ్ధిదారులకు పంపిణీ చేయాల్సిన షౌష్టికాహారం పాడైపోయింది. గిరినగర్ అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహారం దర్వాసన వస్తోంది.
40 రోజులపైగా అంగన్వాడీ వర్కర్లు జీతాలు పెంచాలని ధర్నాలు, దీక్షలు చేపట్టారు. అప్పటి నుంచి విధులకు హాజరు కాలేదు. ఈ సమయంలో పౌష్టికాహారం గర్భిణీ స్త్రీలకు, తల్లులకు, బిడ్డలకు అందలేదు. 40 రోజులపాటు నిల్వ చేయడంతో పౌష్టికాహారం పాడైంది. పర్యవేక్షించాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు వ్యవహరించారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. పాలు పాడైపోయాయి. చెక్కీలు పురుగులు పట్టాయి. ఖర్జూరం కుళ్లిపోయి దుర్వాసన వెదజల్లుతుంటే అధికారులు మాత్రం పట్టించుకోలేదని అంటున్నారు.