Road Accident in Bapulapadu Krishna District: కృష్ణాజిల్లా బాపులపాడు మండలం కోడూరుపాడులో జరిగిన రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కోడూరుపాడు హెచ్ పీ పెట్రోల్ బంక్ సమీపంలో తెల్లవారుజామున, కారు అదుపు తప్పి లారీని ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మరణించారు.
ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. వేగంగా వచ్చిన కారు.. లారీని ఢీ కొట్టడంతో కారు నుజ్జునుజ్జయింది. మృతులంతా తమిళనాడుకి చెందిన వారిగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆరాతీస్తున్నారు. ప్రాణాలు కోల్పోయిన వారంతా ఒకే కుటుంబానికి చెందిన వారు. వీరంతా కొవ్వూరు నుంచి తమిళనాడుకి వెళ్తున్నారు.
Also Read: తిరుపతిలో ఘోర రోడ్డు ప్రమాదం, కారులో ఆ నలుగురు మృతి
మృతి చెందిన వారిలో స్వామినాథన్(40), రాధప్రియ (14), గోపి(23) రాకేష్ (12) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా స్వామినాథన్ భార్య సత్యకు(28) తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో ఆమెను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.