Road Accident in Araku Valley(Local news andhra Pradesh): మహాశివరాత్రి సందర్భంగా జరిగిన జాతరకు వెళ్లి వస్తూ.. రోడ్డుప్రమాదంలో తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. అరకులోయలో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అరకులోయ – లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరుగుతోంది. ఆ జాతరకు వెళ్లి.. తిరిగి వస్తున్న రెండు బైక్ లను అరకులోయ నుంచి వెళ్తున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీ కొట్టింది.
Read More : ఆస్ట్రేలియాలో కృష్ణాజిల్లా యువతి మృతి
అరకులోయ మండలం గన్నెల రహదారిలో గల మాదల పంచాయతీ నందివలస వద్ద జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మృతుల్లో నాలుగేళ్ల బాలుడు కూడా ఉన్నాడు. మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి. ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. మృతులు చినలబుడు ప్రాంతానికి చెందిన బురిడీ హరి (17), గొల్లూరి అమలాకాంత్ (13), లోతేరుకు చెందిన త్రినాథ్ (32), భార్గవ్ (4)లుగా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.