EPAPER

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన బైక్.. ముగ్గురు దుర్మరణం

Road Accident in Palnadu: పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న లారీని బైక్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు.


పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిడుగురాళ్ల మండలం అంజీపురం టోల్ ప్లాజా సమీపంలో ఓ లారీ ఆగి ఉంది. అయితే బైక్ పై ప్రయాణిస్తున్న వారు ఆగి ఉన్న లారీ కనిపించకపోవడంతో బలంగా వెనుకనుంచి ఢీకొట్టారు. దీంతో బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.

మృతులు నాగతేజరెడ్డి, ఇందు, అమూల్యగా గుర్తించామని పోలీసులు తెలిపారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వ్యక్తులుగా తెలుస్తుందని, వీరంతా గురజాలలో ఓ వివాహ వేడుకకు హాజరై తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెబుతున్నారు.  ఈ ఘటనపై విచారణ చేపడుతున్నామ పోలీసులు తెలిపారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


Related News

Tirumala Prasadam row: తిరుమల లడ్డూ వివాదం, రామ్ జన్మభూమి ట్రస్ట్.. రమణ దీక్షితులు రియాక్ట్, శారదా పీఠం సైలెంట్ వెనుక..

Pawan Kalyan: తిరుమల లడ్డూ వివాదం.. డిప్యూటీ సీఎం పవన్ సంచలన పోస్ట్

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Big Stories

×