EPAPER
Kirrak Couples Episode 1

Chandragiri Fake Votes : ఓటర్ల నమోదు అక్రమాలపై విచారణ.. బీఎల్ఓలకు షాకాజ్ నోటీసులు జారీ..

Chandragiri Fake Votes : ఓటర్ల నమోదు అక్రమాలపై విచారణ.. బీఎల్ఓలకు షాకాజ్ నోటీసులు జారీ..

Chandragiri Fake Votes : తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఓట్ల దందాపై తెలుగుదేశం పోరాటం ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తుంది. ధ్రువీకరణ పత్రాలు లేకుండానే ఓట్లు నమోదు చెయ్యడంపై విచారణ జరుగుతోంది. కొంతమంది బీఎల్‌ఓలకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. నియోజకవర్గంలో ఇతర ప్రాంతాల వ్యక్తుల ముఖాలు సరిగా లేకుండానే వారిని ఓటర్ల జాబితాలో చేర్చడానికి ప్రయత్నించారు. ఇందుకు సంబంధించి 49,956 వేల ఓట్లను చేర్పించడానికి ఫారం సిక్స్ దరఖాస్తులు సమర్పించారని టీడీపీ జాతీయ ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆర్డీఓ నిశాంత్ రెడ్డి దీనిపై విచారణ చేశారు.


తిరుపతి రూరల్ మండలంలోని దాదాపు 24 వేల ఓట్లర్ల ముఖాలు సరిగా కనిపించకుండా ఉన్న వారి ఓట్లు గుర్తించినట్లు తెలుస్తోంది. వారు సమర్పించిన ధ్రువీకరణ పత్రాలు కూడా సరిగా లేవని తెలుస్తొంది. దీంతో సంబంధిత బీఎల్ఓ లపై విచారణ ప్రారంభించారు. స్థానికేతరుల ద్వారా వారు ఫారం6 తీసుకున్నట్లు తెలుస్తోంది.

మొత్తం మీద నియోజకవర్గంలో ఫారం7 ద్వారా తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు, జనసేనకు సంబంధించిన ఓట్లను 50 వేలకు పైగా తొలగించారంటూ ఫిర్యాదు అందింది. దీంతోపాటు ఫారం సిక్స్ ద్వారా 50వేల ఓట్లను అదనంగా చేర్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అటు మండల ఎన్నికల అధికారి నుంచి జాతీయ ఎన్నికల కమిషనర్ వరకు టిడిపి చంద్రగిరి ఇంచార్జి పులవర్తి నానితోపాటు జనసేన ఇంచార్జ్ మనోహర్ కూడా పలుమార్లు ఫిర్యాదు చేశారు.


Related News

Balineni: ఒంగోలులో ఫ్లెక్సీ వార్‌పై స్పందించిన బాలినేని.. జనసేనలోకి వెళ్లడం క్యాన్సిలా?

TTD: తిరుమలలో శాంతి హోమం.. పంచగవ్య ప్రోక్షణ

Chandrababu: జగన్ గట్స్ చూశారా?.. చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

Tirupati Laddu: ఇప్పుడా తృప్తి లేకుండా చేస్తున్నారు.. తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన జగ్గారెడ్డి

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Bhumana Karunakar Reddy: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్

Visakha Yarada beach: సముద్రంలో కొట్టుకుపోతున్న 8 మంది విదేశీయులు.. కాపాడిన తెలుగు లైఫ్ గార్డ్స్..అసలేం జరిగిందంటే?

Big Stories

×