Rain Alert to Teugu States: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈనెల 20న ఉత్తర అండమాన్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడనుండగా.. ఈనెల 22న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. వాయవ్య దిశగా కదిలి మరింత బలపడనుంది. ఈనెల 21 వరకు ఏపీకి వర్షసూచన ఉంటుందని హెచ్చరించింది.
సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని.. ఇది పశ్చిమ దిశగా కదులుతూ బలహీనపడి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం తీరం దాటే అవకాశం ఉందని, ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
దీని ప్రభావంతో రేపు కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సాఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరికొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వెల్లడించింది.
Also Read: అమ్మో దువ్వాడ.. మాధురి.. ఇంత స్కెచ్ వేశారా.. అంతా ప్లాన్ ప్రకారమేనా?
అలాగే తెలంగాణలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ప్రధానంగా నారాయణపేట, నాగర్ కర్నూల్, గద్వాల, మహబూబ్ నగర్, వరంగల్, సంగారెడ్డి, నిర్మల్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, ఖమ్మం తదితర జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది.