Hotel: ఆ హోటల్కు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. టేస్టీ ఫుడ్తో పాటు క్వాలిటీ ఫుడ్ అందించండంలో మంచి పేరుంది. ఏ శుభ కార్యమైనా ఆ హోటల్ భోజనం ఆర్డర్ ఇవ్వాల్సిందే. కానీ ఇదంతా ఒకప్పటి మాట. తరాలు మారుతున్నా కొద్దీ.. పద్దతి మారుతోంది. రానురాను ఆ హోటల్లో ఫుడ్ క్వాలిటీ తగ్గిపోతుంది. అదే కాకినాడలో దశాబ్దాలుగా ఉన్న ఆంధ్రా ఫేమస్.. ‘సుబ్బయ్య గారి హోటల్’.
తాజాగా సుబ్బయ్య హోటల్లో పాడైపోయిన కూరలను విక్రయిస్తున్నారని కొందరు కస్టమర్లు ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేసారు. బాధితుల ఫిర్యాదుతో సుబ్బయ్య హోటల్లో తనిఖీలు చేపట్టారు అధికారులు.
తనిఖీలో పాడైపోయిన జీడిపప్పు, నీట్గా లేని వంట సామాన్లు వినియోగిస్తున్నట్లు గుర్తించారు. నాసిరకం పదార్ధాలతో వంటల చేస్తున్నట్లు అనుమానాలు ఉన్నాయని అధికారులు చెప్పారు.
జీడిపప్పుతో పాటు, పలు పదార్ధాలను పరీక్షల కోసం తీసుకున్నారు. శాంపిల్స్ రిజల్ట్స్ను బట్టి హోటల్పై చర్యలు ఉంటాయని తెలిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు.