Puttaparthi : పుట్టపర్తిలో సత్యసాయి 97వ జయంతి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేణుగోపాల స్వామి రథానికి ప్రత్యేక పూజలు చేసి వేడుకలను ప్రారంభించారు సత్యసాయి సెంట్రల్ ట్రస్టీ రత్నాకర్. రథంపై వేణుగోపాలుడిని పట్టణంలో ఊరేగించారు నిర్వహకులు. రథోత్సవాన్ని తిలకించడానికి పట్టణంలో బారులు తీరారు భక్తులు. ఈ సందర్భంగా సత్యసాయి నామస్మరణతో పుట్టపర్తి మారుమోగింది. ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ బసంత్ కుమార్, అడిషనల్ ఎస్పి రామకృష్ణ ప్రసాద్, మాజీ మంత్రి పల్లె పాల్గొన్నారు.